ఏపీ మంత్రులే నిజమైన వీధి రౌడీలు!: వైసీపీ నేత మల్లాది

  • ఈ నాలుగేళ్లలో జరిగినన్ని హత్యలు గతంలో ఎన్నడూ జరగలేదు
  • జగన్ ను విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదు
  • ఐదుసార్లు ఓటమిపాలైన సోమిరెడ్డా జగన్ ని విమర్శించేది?
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆ పార్టీ నేత మల్లాది విష్ణు ఖండించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ మంత్రులే నిజమైన వీధి రౌడీలని, ఈ నాలుగేళ్లలో జరిగినన్ని హత్యలు గతంలో ఎన్నడూ జరగలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ ను విమర్శించే అర్హత వాళ్లిద్దరికీ లేదని అన్నారు.

ఐదుసార్లు ఓటమిపాలై, ప్రజల చేత తిరస్కరించబడ్డ వ్యక్తి సోమిరెడ్డి కూడా జగన్ పై వ్యాఖ్యలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. మరోపక్క, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్ లో మీడియాతో మట్లాడుతూ, ప్రత్యేక హోదా తోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని, హోదా సాధన నిమిత్తం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు. ఎంపీల దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు చెప్పారు. తాము చేస్తున్న ఉద్యమానికి టీడీపీ నేతలు కలిసి రావాలని కోరారు.
Go Back to Shorts
YSRCP
malladi
botsa

More Telugu News